వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు

56చూసినవారు
ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో ఆదివారం వర్షాలు కురవాలని స్థానిక ప్రజలు గంగమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ జాతర నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈసారి అతి తక్కువగా వర్షాలు కురిసిన నేపథ్యంలో వర్షాలు బాగా పడాలన్న కోరిక మేరకు గ్రామస్తులు అందరూ కలిసి ఈ జాతర నిర్వహించినట్లుగా స్థానిక ప్రజలు తెలిపారు. దేవతలకు బోనం సమర్పించి అంగరంగ వైభవంగా జాతర నిర్వహించారు. ఈ జాతరలో స్థానిక ప్రజలు భారీగా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్