టిడిపి రాష్ట్ర సంఘటన కార్యదర్శి, ఆయన కుటుంబ సభ్యులపై తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరు వెంకటరెడ్డిపై చర్యలు తీసుకోవాలని శనివారం సింగరాయకొండ పిఎస్ లో స్థానిక కమిటీ ఫిర్యాదు చేశారు. వెంకటరెడ్డి ఎక్స్ లో చేసిన తప్పుడు పోస్ట్ పై విచారించి చర్యలు తీసుకోవాలని, వెంకటరెడ్డి చేసిన నిరాధార ఆరోపణలపై పరువు నష్టం కేసు వేస్తానని కార్యదర్శి దామచర్ల సత్యనారాయణ పేర్కొన్నారు.