నేటి నుండి విద్యార్థులకు బేస్ లైన్ పరీక్షలు

67చూసినవారు
నేటి నుండి విద్యార్థులకు బేస్ లైన్ పరీక్షలు
ప్రకాశం జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 3, 4, 5 తరగతుల విద్యార్థులకు నేడు, రేపు బేస్ లైన్ టెస్ట్ నిర్వహించాలని డీఈవో సుభద్ర సోమవారం తెలిపారు. బేస్ లైన్ పరీక్ష నిర్వహణ, శాంపిల్ పరీక్ష పత్రాలను ఇప్పటికే మండల విద్యాశాఖ అధికారులకు మెయిల్ పంపామన్నారు. పరీక్షల అనంతరం విద్యార్థుల ఫలితాలను వెబ్ సైట్లో సకాలంలో అప్లోడ్ చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్