వరద బాధితుల కోసం విరాళాల సేకరణ

74చూసినవారు
వరద బాధితుల కోసం విరాళాల సేకరణ
వరద బాధితుల సహాయార్థం విరాళాల భాగస్వామ్యంలో.. ప్రతి మహిళ పాల్గొనాలని డాక్టర్ మద్దాలి మాధవరావు అన్నారు. చీమకుర్తి మెప్మా ఆఫీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమం ద్వారా విజయవాడ వరద బాధితుల్లో కొంతమందికైనా నిత్యవసర సరుకులు అందించాలన్నదే శ్రీ అభయ సేవ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం అన్నారు. ఇప్పటి వరకు 300 గడపలు తిరుగుతూ విరాళాలు సేకరించామన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా సీఎంఎం సంపత్ కుమార్, ఆలూరి చిరంజీవి, మెప్మా ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్