కాంగ్రెసులో చేరుతున్నట్లు మంగళవారం చీరాలలో ప్రకటించిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆచితూచి మాట్లాడారు. టిడిపి, వైసిపి నాయకత్వాలను నొప్పించని రీతిలో ప్రసంగించడమే కాకుండా ఆయా పార్టీల శ్రేణులను అలరించే విధంగా ఆయన మాట్లాడారు. 2019 లో ఆమంచి టిడిపిని వీడి వైసీపీలో చేరిన సందర్భంగా చంద్రబాబు, లోకేష్ లపై విరుచుకుపడి ఆ ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోయారు. దీంతో ఈసారి ఆయన జాగ్రత్త పడ్డారనే చెప్పాలి.