టిడిపి ఎమ్మెల్సీ పంచమర్తి అనూరాధ చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే, ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ లపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వారిద్దరూ చీరాలకు రాచపీనుగులని ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె అభివర్ణించారు. వారిద్దరూ అక్రమార్కులన్నారు. కరణం బలరాం టిడిపిలోకి తిరిగి వచ్చే ప్రయత్నాలు చేస్తే భంగపాటు తప్పదని పరుష పదజాలంతో ఎమ్మెల్సీ అనురాధ హెచ్చరించారు.