
కంభం: ఘనంగా పాఠశాల వార్షికోత్సవం
కంభం మండలంలోని ఎన్. ఆర్ తురుమెళ్ళ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం పాఠశాల వార్షికోత్సవాన్ని, వీడ్కోలు వేడుకలను పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు క్రమశిక్షణతో, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ప్రధానోపాధ్యాయుడు సి. హెచ్. భాస్కర్ నాయుడు అన్నారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ జ్యోతి, వైస్ చైర్మన్ పావని, సభ్యులతో పాటు ఉపాధ్యాయురాలు కళ్యాణి, సీఆర్పి అనురాధ, తల్లింద్రండులు ఉన్నారు.