![పలు దుకాణాలపై అధికారులు దాడులు పలు దుకాణాలపై అధికారులు దాడులు](https://media.getlokalapp.com/cache/0e/0d/0e0deffe80ab3173f167eec8595525a3.webp)
పలు దుకాణాలపై అధికారులు దాడులు
కంభంలో గురువారం పలు దుకాణాలపై తూనికలు కొలతల అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 3 దుకాణాలపై తూనికల కొలతల అధికారులు కేసులు నమోదు చేశారు. కాలం చెల్లిన వస్తువులను అమ్మడంతో పాటు ధరల పట్టికలను ఏర్పాటు చేయకపోవడం వంటి అంశాలపై మూడు దుకాణాలపై కేసు నమోదు చేసినట్లుగా తూనికల కొలతలు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే తూనికల కొలతలు అధికారులు దాడులతో పలు దుకాణా దారులు దుకాణాలను మూత వేసి పారారయ్యారు.