అన్న క్యాంటీన్ ని పరిశీలించిన కమిషనర్

57చూసినవారు
అన్న క్యాంటీన్ ని పరిశీలించిన కమిషనర్
పట్టణంలోని అన్నా క్యాంటీన్ ను గిద్దలూరు నగర పంచాయతీ కమిషనర్ వెంకట దాసు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలకు అందిస్తున్న ఆహారం తయారు చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచనలు సలహాలు ఇచ్చారు. నిర్దేశించిన సమయం, మెనూ ప్రకారం ప్రజలకు 5 రూపాయలకే ఆహారాన్ని అందించాలని వారికి కమిషనర్ తెలిపారు. క్యాంటీన్ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు.

సంబంధిత పోస్ట్