కంభం చెరువును పర్యాటక కేంద్రంగా చేసేందుకు మంత్రి హామీ

57చూసినవారు
కంభం చెరువును పర్యాటక కేంద్రంగా చేసేందుకు మంత్రి హామీ
ఆసియా ఖండంలోనే అతిపెద్ద చారిత్రాత్మక కంభం చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు, తాము పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటామని, రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేష్ హామీ ఇచ్చారు. సోమవారం రాజమండ్రిలోని మంత్రి నివాసంలో కంభం, బేస్తవారిపేట, అర్థవీడు మండలాల, శ్రీకృష్ణదేవరాయ బలిజ సేవా సంఘం నేతలు మంత్రికి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా నవంబర్లో, కార్తీక వనభోజన మహోత్సవ సందర్భంగా, కంభం చెరువును సందర్శించాలని మంత్రిని ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్