మద్యం దుకాణంలో చోరీ
మార్కాపురం మండలం రైల్వే స్టేషన్ వద్ద ఉన్న మద్యం దుకాణంలో శనివారం రాత్రి చోరీ జరిగింది. దుకాణం వెనక నుంచి గోడకు కన్నం వేసి చోరీ కి పాల్పడ్డారు. దుకాణంలో ఉన్న మద్యం సీసాలు అపహరించారు. ఘటనా స్థలాన్ని ఎస్సై వెంకటేశ్వర నాయక్ పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.