
పొదిలి: 293 పొగాకు బేళ్లు కొనుగోలు
ప్రకాశం జిల్లా పొదిలిలోని పొగాకు వేలం కేంద్రంలో 293 పొగాకు బేళ్లను కొనుగోలు చేసినట్లు నిర్వహణ అధికారి గిరిరాజ్ కుమార్ తెలిపారు. మంగళవారం స్థానిక రైతులు వేలం కేంద్రానికి 352 పొగాకు బేళ్లను తీసుకురాగా వివిధ కారణాలతో 55 పొగాకు బేళ్లు తిరస్కరణకు గురైనట్లు వెల్లడించారు. ఎ. ఫ్ 1 రకం కిలో గరిష్ట ధర రూ. 280 కనిష్ట ధర రూ. 260. పలికిందని 11 కంపెనీలు వేలంలో పాల్గొన్నాయని అధికారి చెప్పారు.