నేటి నుండి విద్యార్థులకు బేస్ లైన్ పరీక్షలు

63చూసినవారు
నేటి నుండి విద్యార్థులకు బేస్ లైన్ పరీక్షలు
జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికొన్నత పాఠశాలల్లో నేడు, రేపు బేస్ లైన్ పరీక్ష నిర్వహిస్తున్నట్లుగా డీఈవో సుభద్ర సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 3, 4, 5వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని, పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు ఇప్పటికే మండల విద్యాశాఖ అధికారి మెయిల్ కు పంపించినట్లుగా తెలిపారు. పరీక్ష నిర్వహించి అనంతరం ఆన్లైన్ లో మార్కులను అప్లోడ్ చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్