నీవర్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించాలని, ఉన్నతాధికారులతో పంట నష్టం సమగ్ర సర్వే నిర్వహించి రైతాంగాన్ని ఆదుకోవాలని ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు లేఖ రాశారు. ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించాలని సిఎంకు ప్రత్యేకంగా లేఖ రాశారు. వీటితో పాటు జిల్లాలో నీట మునిగిన పంటలు వీడియో వారికి పంపించారు.