చీమకుర్తి మండలం తొర్రగుడిపాడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, వైసీపీ నాయకులు కొనికి నాగేశ్వరరావుతో పాటు పలు కుటుంబాలు మంగళవారం టీడీపీలో చేరాయి. సంతనూతలపాడు నియోజకవర్గ కూటమి పార్టీ అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ వారికి కండువాలు కప్పి పార్టీలోకిఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయానికి కృషి చేయాలని విజయ్ అన్నారు.