ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రూ.5 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 30న ఉగాది నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. 100 మందికి ఉగాది పురస్కారాలు ఇవ్వడానికి, ఇతర వ్యయాలకు రూ.2.25 కోట్లు, జిల్లాల్లో కార్యక్రమాల నిర్వహణకు రూ.2.60 కోట్ల చొప్పున కేటాయించారు.