పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి: సీఈవో

80చూసినవారు
పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి: సీఈవో
AP: ఓట్ల లెక్కింపు రోజు, తర్వాత ఘర్షణలు జరగకుండా రాష్ట్రంలో పటిష్ట భద్రతా ఏర్పాటు చేస్తున్న‌ట్లు సీఈవో ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. "స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశాం. సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశాం. అల్లర్ల దృష్ట్యా రాష్ట్రానికి 20 కంపెనీ బలగాలను కేటాయించాం. పల్నాడు జిల్లాలో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి." అని మీడియా ఎదుట మీనా వెల్ల‌డించారు.

సంబంధిత పోస్ట్