పోస్టల్‌ బ్యాలెట్లకు ప్రత్యేక కౌంటర్లు: సీఈవో మీనా

80చూసినవారు
పోస్టల్‌ బ్యాలెట్లకు ప్రత్యేక కౌంటర్లు: సీఈవో మీనా
AP: రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సీఈవో ముకేశ్‌ కుమార్‌ మీనా వెల్ల‌డించారు. "రేపు ఉ. 8 గంటల నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌, 8.30 నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈసారి పోస్టల్‌ బ్యాలెట్లు ఎక్కువగా వచ్చాయి. వీటికి ప్రత్యేక కౌంటర్లు ఉంటాయి. లెక్కింపు కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నాం. హింసాత్మక ఘటనలు జరగకుండా బలగాలను మోహరిస్తున్నాం." అని మీనా తెలిపారు.

సంబంధిత పోస్ట్