AP: చంద్రగిరిలో ఫాం-17A (ఓటర్ల జాబితా), ఇతర డాక్యుమెంట్లు మరోసారి పరిశీలించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన
వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. మోహిత్రెడ్డి పిటిషన్ను సుప్రీం ధర్మాసనం కొట్టేసింది. నియోజకవర్గంలోని నాలుగు కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని ఆయన చేసిన విజ్ఞప్తిని కూడా కోర్టు తిరస్కరించింది. జోక్యం చేసుకునేందుకు సరైన కారణాలు లేవని స్పష్టం చేసింది.