కస్తూర్బా విద్యాలయాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే

75చూసినవారు
కస్తూర్బా విద్యాలయాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే
గుడ్లూరు మండలం ముగ్గులూరు లోని కస్తూర్బా విద్యాలయాన్ని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యాలయంలోని తరగతి గదులు, వంటగదులు పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. చదువుకునే విద్యార్థుల చేత పాఠశాల పరిధిలో ఎటువంటి పనులు చేయించిన చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు. పాఠశాలలో ప్రస్తుతం 200 మంది విద్యార్థులు ఉన్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్