అల్లూరు మండలంలోని పూరీని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో శనివారం ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా విశేష పూజ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. స్వామివారికి అభిషేకం, సింధూర పూజ, పల్లకి సేవ తదితర కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.