కొడవలూరు మండల ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశ కార్యక్రమాన్ని ఆగస్టు ఒకటవ తేదీన నిర్వహిస్తున్నట్లు మండల అధికారులు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం పది గంటల ముఫ్పై నిమిషాలకు ఈ సమావేశం ప్రారంభమవుతుందని తెలియజేశారు. మండలంలో ఎదుర్కొంటున్న పలు ప్రధాన సమస్యలను ఈ సమావేశంలో చర్చిస్తారు. ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ హాజరు కావాలని కోరారు.