నెల్లూరు రూరల్ లోని 29వ డివిజన్ ఆనం వెంకటరెడ్డి నగర్ లో టిడిపి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని భారీ మెజరిటీ తో గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక టిడిపి డివిజన్ ఇంచార్జ్ గుద్దేటి చెంచయ్య, ఇరిగేషన్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మమతారెడ్డి, గంగాధర్, జిలానీ, బిజెపి నేత మొగరాల సురేష్ పాల్గొన్నారు.