ముదిగుబ్బలోని ప్రభుత్వ ఆసుపత్రి క్వార్టర్ శిథిలావస్థకు చేరుకుంది. ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ల అవసరం నిమిత్తం 1962లో దీన్ని నిర్మించారు. అయితే కాలక్రమేణా వేరే ప్రాంతాల నుంచి డాక్టర్లు వచ్చి, పోవడంతో ఇది కాస్తా నిరూపయోగంగా మారింది. ప్రస్తుతం ఉన్న డాక్టర్లు ఈ స్థితిలో ఉన్న క్వార్టర్లో నివాసం ఉండేందుకు భయపడుతున్నారు. ప్రభుత్వం కొత్తగా నిర్మించి ఇవ్వాలని కోరుతున్నారు.