పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధి ఎనములపల్లి సమీపంలోని వ్యవసాయ గోడంలో నిలువ ఉంచిన టపాసులను సీఐ కొండారెడ్డి జప్తు చేశారు. గురువారం సమస్మాత్మక గ్రామాల్లో తనిఖీలు చేస్తుండగా శిల్పారామం వెనుక భాగంలో గోవర్ధన్ రెడ్డి గోడౌన్ లో నిలువ చేసిన రూ. 45 వేల విలువ చేసే టపాసులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పెట్రోలు, డీజిల్, టపాసులు నిలువ ఉంచుకోవడం చట్టరీత్యా నేరమని తెలిపారు.