సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి గత ఫిబ్రవరిలో 'నిజం గెలవాలి' కార్యక్రమంలో భాగంగా ధర్మవరంలో చేనేత కుటుంబాలను పరామర్శించారు. అధికారంలోకి రాగానే వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఇందులో భాగంగానే సోమవారం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ చేనేత ధర్మవరం టీడీ కుటుంబాలను పరమర్శించారు. వారి సమస్యలను పరిష్కరిస్తామని, వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.