వాటర్ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలి

79చూసినవారు
తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని పుట్టపర్తిలోని సత్యసాయి వాటర్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు చేపట్టిన సమ్మె ఆదివారానికి 18వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో చేపట్టి యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీలను ప్రస్తుతం మంత్రి అయ్యాక పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్