పుట్టపర్తి పొలంలో ఉన్న తన భూమికి పాసు బుక్కు మంజూరు చేయాలని రైతు చిమిరాల జగన్నాథ్ కలెక్టర్ చేతన్ కి సోమవారం వినతి పత్రం సమర్పించారు. సర్వే నెంబర్లు 295-1, 296-3, 296-7 లలో 33 సెంట్ల భూమి ఉందన్నారు. దాన్ని సర్వే చేయించి పాసు బుక్కు మంజూరు చేయాలని 30 సంవత్సరాల నుంచి తిరుగుతున్నానని కలెక్టర్ తో వాపోయారు. పూర్తి లింకు డాక్యుమెంట్లు తన వద్ద ఉన్నాయని, వాటిని చూసి తనకు న్యాయం చేయాలని కోరారు.