తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలతో శ్రీవారి దర్శనానికి టీటీడీ అనుమతించింది. ఈ విధానాన్ని ఈ నెల 24 నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించింది. వీఐపీ, రూ.300 దర్శనాలకు అనుమతినిచ్చింది. ఒక్కో ప్రతినిది నుంచి రోజుకు ఒక లేఖకు పర్మిషన్ ఇచ్చింది. సిఫార్సు లేఖపై ఆరుగురికి శ్రీవారి దర్శన భాగ్యం కలుగనుంది. సోమవారం, మంగళవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉండగా.. బుధవారం, గురువారం రూ.300 ప్రత్యేక దర్శనాన్ని టీటీడీ కల్పిస్తోంది.