రాప్తాడు: వరద ప్రాంతాల్లో పర్యటించిన సీపీఎం కార్యదర్శి

51చూసినవారు
రాప్తాడు: వరద ప్రాంతాల్లో పర్యటించిన సీపీఎం కార్యదర్శి
రాప్తాడు మండలం యం. బండమీద పల్లి గ్రామంలో మంగళవారం సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ పర్యటించారు. గ్రామంలో వర్షాలకు నష్టపోయిన పంటలను అయన పరిశీలించారు. చల్లాపురం పూజారి బోయ మాధవయ్యకు చెందిన 90 గొర్రెలు నీట మునిగి చనిపోవడంతో రైతును వారు పరామర్శించారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం రాప్తాడు మండల అధ్యక్షుడు ఏం. పోతలయ్య, జిల్లా కమిటీ సభ్యులు టి. రామాంజనేయులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్