ఆముదాలవలస మండల విస్తరణాధికారి దుంపల గోవిందరావుకు శనివారం ఆత్మీయ సత్కారం జరిగింది. శుక్రవారం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తమ ఈఓపిఆర్డి గా అవార్డు పొందిన నేపథ్యంలో పలువురు పంచాయతీ కార్యదర్శులు మరియు కార్యాలయ సిబ్బంది ఈ గౌరవ సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వాసుదేవరావు తో పాటు అధికారులు, తదితరులు పాల్గొని గోవిందరావుకు అభినందనలు తెలిపారు.