ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ను నియోజకవర్గం కూటమి టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ మర్యాదపూర్వకంగా కలిశారని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటనలో గురువారం తెలిపారు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం విద్యార్హత సర్టిఫికెట్లపై రాష్ట్ర సీఐడి తో విచారణ జరిపించాలని ఫిర్యాదు అందించారు. గతంలో ఫిర్యాదు చేస్తే వైసీపీ హయాంలో విచారణ జరగలేదని అన్నారు.