రాయితీపై రైతులకు విత్తనాలు సరఫరా

77చూసినవారు
రాయితీపై రైతులకు విత్తనాలు సరఫరా
రాయితీపై రైతులకు విత్తనాలు సరఫరా చేస్తున్నట్లు ఆమదాలవలస మండల వ్యవసాయ శాఖ అధికారి మెట్ట మోహనరావు మంగళవారం తెలిపారు. ఖరీఫ్ సీజన్ వరి విత్తనాల కోసం రైతులందరూ గ్రామస్థాయిలో వ్యవసాయ సహాయకుల ద్వారా తమ పేరు రేపు నమోదు చేసుకోవాలని సూచించారు. ఆమదాలవలస మండల పరిధిలో 5216 హెక్టార్ల విస్తీర్ణానికి గాను 1290 క్వింటాల విత్తనాలు మంజూరు కాబడ్డాయని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్