లావేరు మండలం శహపురంలో రహదారి మరమత్తు పనులు గురు, శుక్రవారం రెండు రోజులపాటు నిర్వహించారు. శహపురంలో గ్రామానికి చెందిన జనసేన యువనాయకుడు గేదెల గోపి రూ.50,000 తన సొంత ఖర్చుతో ఈ పనులు చేపట్టారు. ఆ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో రోడ్డు మరమ్మత్తు పనులు జరిగాయి. వర్షాలు కురుస్తున్న తరుణంలో రోడ్డుపై గుంతల్లో నీళ్లు చేరుకుని రహదారి ప్రమాదాలు జరగకుండా ఈ చర్యలు చేపట్టడంపై ఆ గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.