ఇంటర్ విద్యార్థి అదృశ్యం.. కేసు నమోదు

73చూసినవారు
ఇంటర్ విద్యార్థి అదృశ్యం.. కేసు నమోదు
నరసన్నపేట మండలం గోట్టిపల్లి పంచాయితీ యాతపేట గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి అదృశ్యం అయినట్లు ఫిర్యాదు అందిందని ఏఎస్ఐ ఆసిరినాయుడు తెలిపారు. బోచ్చ ఆదినారాయణ కుమారుడు ఉదయ్ సోమవారం ఒక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాడు. అదే రోజు సాయంత్రం సైకిల్ బాగు చేయించుకుంటానంటూ బయలుదేరిన ఉదయ్ అదృశ్యం అయ్యాడని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేశామని ఏఎస్ఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్