రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనకు స్వస్తి పలకాలని శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. కోటబొమ్మాళి మండలం చిన్న తుంబయ్య పేట, రేగులపాడు, నారాయణ వలస గ్రామాలలో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో అభివృద్ధి జాడలు కనిపించకుండా పోయాయని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు.