శ్రీకాకుళం జిల్లాలో గెలిచిన కూటమి నాయకులు, కాబోయే మంత్రులు ఆయకట్టు రైతులను ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన మాట్లాడుతూ. జిల్లాలో ఆముదాలవలస నియోజకవర్గం బూర్జ ఓనిగెడ్డ, ఓపెన్ హెడ్ చానల్స్ ఆయకట్టు స్థిరీకరణచేసి నారాయణపురం ఆనకట్ట పరిధిలో సాగునీరు అందించాలన్నారు. రైతులకు న్యాయం చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి బుడితి అప్పలనాయుడు అన్నారు.