ఉండవల్లిలో టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను ఆముదాలవలస నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆముదాలవలస శాసన సభ్యులుగా ఎన్నికైన కూన రవికుమార్ ఉండవల్లిలో ఉన్న టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను శాసనసభ్యులుగా తొలిసారిగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు నియోజకవర్గానికి సంబంధించిన అంశాలపై చర్చించుకున్నారు. తమ్మినేని పై గెలిచినందుకు అభినందించారు.