సీఎం సభకు బయలుదేరిన లావేరు మండల నాయకులు

72చూసినవారు
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో శనివారం సాయంత్రం 'సిద్ధం' అనే నినాదంతో భీమిలిలో జరగనున్న ప్రాంతీయ కేడర్ బహిరంగ సభకు లావేరు మండల నాయకులు బయలు దేరారు. లావేరు మండల వ్యాప్తంగా ప్రత్యేక బస్సుల్లో పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండడంతో చేపట్టాల్సిన కార్యాచరణపై సీఎం జగన్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు.

సంబంధిత పోస్ట్