ఐదు కేజీల గంజాయి స్వాధీనం.. ఒకరి అరెస్టు

73చూసినవారు
ఐదు కేజీల గంజాయి స్వాధీనం.. ఒకరి అరెస్టు
ఒరిస్సా రాష్ట్రం గజపతి జిల్లాకు చెందిన గోపాల్ సింగ్ అనే వ్యక్తి గంజాయి విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఇచ్చాపురం పట్టణంలో 5. 310 కేజీల గంజాయితో పట్టుకున్నట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. బీకాం వరకు చదువుకున్న గోపాల్ సింగ్ వ్యసనాల బారిన పడి గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అతడి వద్ద నుంచి ఒక సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

సంబంధిత పోస్ట్