ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలలో 12 కేజీల వెండి ఆభరణాలు స్వాధీనం

74చూసినవారు
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఫ్లయింగ్ స్క్వాడ్ నిర్వహిస్తున్న వాహన తనిఖీలలో 12 కేజీల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక సత్యవరం కూడలి వద్ద ఆదివారం తనిఖీలు నిర్వహిస్తుండగా ఎటువంటి రసీదులు లేకుండా తరలిస్తున్న 12 కేజీల వెండి ఆభరణాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఈ మేరకు నరసన్నపేట ఆర్ వో కు అప్పగించామని డిటి గాయత్రి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్