వరి విత్తనాల కోసం రైతు భరోసా కేంద్రాలలో నమోదు చేసుకోండి

75చూసినవారు
వరి విత్తనాల కోసం రైతు భరోసా కేంద్రాలలో నమోదు చేసుకోండి
ఖరీఫ్ సీజన్ కు సంబంధించి వరి విత్తనాలు కావలసినవారు రైతు భరోసా కేంద్రాల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని నరసన్నపేట వ్యవసాయాధికారిణి సునీత సూచించారు. సోమవారం చిక్కాలవలస రైతు భరోసా కేంద్రాల్లో రైతు నమోదు ప్రక్రియను ఆమె పరిశీలించారు. ప్రస్తుతం రైతు భరోసా కేంద్రాల్లో బీపీటీ 5204, ఎంటీయూ 7029, ఎంటీయూ 1224, ఎంటీయూ 1061, ఆర్జేసీ 2537, ఎం టీయూ 1064, ఎంటీయూ 1318, ఎంటీయూ 1121 రకాల వరి విత్తనాలు ఉన్నాయన్నారు.

సంబంధిత పోస్ట్