పలాస నియోజకవర్గం మందస మండలం మకరజోల గ్రామం వద్ద సోమవారం బాతులతో వెళ్తున్న వ్యాన్ బోల్తా పడింది. నెల్లూరు నుండి ఒరిస్సా భద్రక్ కు బాతులతో లోడు వెళుతుండగా మధ్యాహ్నం సమయంలో అదుపుతప్పి వ్యాను బోల్తాపడటంతో అందులో ఉండే కొన్ని బాతులు చనిపోయావి. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది, మందస పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు