నిరంకుశత్వ కుటుంబ పాలనకు స్వస్తి చెప్పాలనే ఉద్దేశంతో పలాస మున్సిపాలిటీ 30వ వార్డులో టీడిపికి భారీ షాక్ ఇచ్చారు. మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోఆదివారం 60మంది యువకులు చేరారు. వీరందరికీ పార్టీ కండువా కప్పి పార్టీలోనికి సాదరంగా మంత్రి ఆహ్వానించారు. నిరంకుశత్వ కుటుంబ పాలనకు స్వస్తి చెప్పాలనే ఉద్దేశంతో వైకాపా నాయకురాలు సుజాత పండా ఆధ్వర్యంలో వారంతా వైకాపాలో చేరారు.