హిర మండలంలోని ఎంఎల్ పురం గ్రామానికి చెందిన 200 మంది తెలుగుదేశం కార్యకర్తలు వారి కుటుంబాలతో సహా శుక్రవారం ఎమ్మెల్యే రెడ్డి శాంతి చేతుల మీదుగా వైఎస్ఆర్సిపి కండువాలు వేయించుకున్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనకు మించిన పాలనలేదని మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవడానికి నడుం బిగించామని అన్నారు. కూటమి వలన ప్రజలకు నష్టం జరుగుతుందని ఆలోచనతోనే వైఎస్ఆర్సిపి లోకి చేరామన్నారు.