రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

54చూసినవారు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మెళియాపుట్టి మండలంలోని చీపురు పల్లి గ్రామానికి చెందిన నందిగాం మధు (42) అనే వ్యక్తి ద్విచక్రవాహన ప్రమాదంలో మృతి చెందాడు. కూరగాయలు కొనుగోలు చేసి వస్తుండగా చీపురుపల్లి సమీపంలో ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంతో వచ్చి బలంగా ఢీకొనడంతో గాయాలయ్యాయి. 108 ద్వారా టెక్కలి ఆసుపత్రి తరలించారు. పరిస్థితి విషమించండంతో శ్రీకాకుళం జెమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్