పాతపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతిని మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి, తద్వారా జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి అందరం సమన్వయంతో పనిచేస్తామని నియోజకవర్గానికి చెందిన పలువురు వైఎస్ఆర్సిపి నేతలు అన్నారు. మంగళవారం ఉగాది సందర్భంగా అసమ్మతినేతలంతా పాతపట్నం ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతిని కలిసి దుస్సాలువాతో సత్కరించి తన వెంటే ఉంటామంటూ మాటిచ్చారు.