డిజిపురం హైస్కూల్ ఉపాధ్యాయ బృందం ఎనరోల్ మెంట్ డ్రైవ్

80చూసినవారు
సంతబొమ్మాలి మండలం డీజీపురం జడ్పీ హైస్కూల్ హెచ్ఎం కోత చైతన్య ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం ఆదివారం బడి ఈడు పిల్లలను డీజీపురం హైస్కూల్లో చేర్పించాలని ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. ఈ మేరకు దండుగోపాలపురం, కోటపాడు, కొత్తూరు, వడ్డితాండ్ర, బృందావనం, కాశీపురం, మహాదేవపురం, ఆరికివలస, చెట్లతాండ్ర గ్రామాలలో ఆటోపై ఎస్ ఎస్ సి ఫలితాల ఫ్లెక్సీలను కట్టి ప్రచారం చేస్తూ ఇంటింటా తిరిగి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్