ఫార్మసిస్ట్ సంఘం జిల్లా అధ్యక్షుడిగా సుబ్రహ్మణ్యం

50చూసినవారు
ఫార్మసిస్ట్ సంఘం జిల్లా అధ్యక్షుడిగా సుబ్రహ్మణ్యం
శ్రీకాకుళం జిల్లా ఫార్మసిస్ట్ సంఘం అధ్యక్షుడిగా సంతబొమ్మాళి మండలంలోని దండు గోపాలపురం పిహెచ్సిలో.. ఫార్మసిస్టుగా విధులు నిర్వహిస్తున్న రేజేటి సుబ్రహ్మణ్యంను ఆదివారం ఎన్నుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో నిర్వహించారు. ఎన్నికల అధికారిగా ఎన్ కిరణ్ కుమార్, రాష్ట్ర పరిశీలకులుగా బిఎస్ నాయుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బోనెల గోపాల్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి. తనకు అవకాశం కల్పించిన జిల్లా, రాష్ట్ర ఫార్మసిస్ట్ సంఘాల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్