మంత్రి నారా లోకేశ్పై వైసీపీ నేత అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. అబద్ధాలు ఆడడంలో తండ్రి చంద్రబాబు నాయుడను మించిపోయాడని ఎద్దేవా చేశారు. తమ అధినేత జగన్పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని ఫైర్ అయ్యారు. కళ్లు నెత్తి మీదకి ఎక్కి వాపును బలం అనుకుని ఒళ్లు బలిసి మాట్లాడుతున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ తెచ్చిన కంపెనీలకు శంకుస్థాపన చేయడం తప్పించి.. మీరు ఏం కంపెనీలు తెచ్చారో చెప్పాలని ప్రశ్నించారు.