AP: ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో హింసాత్మక ఘటన తర్వాత అనుమానితుల్లో కొందరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు కూడా అజ్ఞాతంలోకి వెళ్లారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్, బెంగళూరుకు ప్రత్యేక బృందాలను పంపారు.